నేను వెళ్లే రోజు అన్ని విషయాలు చెప్తా : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

-

పదవీ విరమణకు ముందు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తాను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలిపారు. అవన్నీ తన వీడ్కోలు ప్రసంగంలో చెబుతానని.. అప్పటి వరకు వేచి ఉండమని చెప్పారు.


విచారణ జాబితాలో ఉన్న ఓ కేసును తొలగించడం గురించి సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే బుధవారం సీజేఐ దృష్టికి తీసుకువెళ్లారు. చివరి నిమిషంలో అలా తొలగించడం న్యాయవాదులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

‘మేం ముందురోజు రాత్రి వరకు ఆ కేసును వింటాం. కక్షిదారులు, న్యాయవాదులతో ఎన్నోసార్లు మాట్లాడతాం. అంతా అయ్యాక కేసు డిలీట్‌ అవుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ విధానాన్ని ఖండించాలి. రిజిస్ట్రీ మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని దుష్యంత్‌ దవే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పనితీరు గురించి ఆయన ప్రశ్నలు లేవనెత్తినప్పుడు జస్టిస్‌ రమణ ఈ మేరకు స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news