పీయూష్ గోయల్ అసలు మంత్రేనా? : తలసాని

-

ఎఫ్సిఐ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని.. పీయూష్ గోయల్ అసలు మంత్రేనా? తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీయూష్ కు బాధ్యత ఉందా? తెలంగాణలో పండేది బాయిల్డ్ రైస్. రా రైస్ కొంచెం ఉత్పత్తి అవుతదని పేర్కొన్నారు. దేశంలో ఆకలి తీర్చే పరిస్థితులు కేంద్రానికి ఉండాలని.. తెలంగాణ బీజేపీ కొంటవ, చస్తావా అంటుందని చెప్పారు.

దేశంలో బీజేపీలు రెండు ఉన్నాయా? అసలు బీజేపీ నేతలకు మెదడు ఉందా? అని నిలదీశారు. కేంద్రంలో అధికారంలో ఇచ్చింది ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటానికా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిషన్ రెడ్డి కూడా అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని.. దేశంలో పరిపాలన నడుస్తుందా? అని ఫైర్‌ అయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కు ఒక్క రూపాయి అయిన తెచ్చినవా కిషన్ రెడ్డి? అని నిలదీశారు. ఒకట్రెండు ఉప ఎన్నికల్లో గెలువంగానే అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. నోరుంది కదా ఏది పడితే అది మాట్లాడుతా అంటే చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Latest news