తండ్రి చివరి వీడియో షేర్ చేసి ఎమోషనల్ అవుతున్న తారకరత్న కూతురు..!

-

తారకరత్న మరణించి దాదాపు నెల రోజులు పైగానే అవుతున్నా.. ఆయన మరణం వల్ల కుటుంబం పడుతున్న బాధ వర్ణనాతీతం. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా సరే.. అలేఖ్య రెడ్డి కుటుంబంలో తారకరత్నలేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తారకరత్న కూతురు నిష్కా తన తండ్రితో చివరిసారి ఆడుకున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

తనతో తండ్రి ఆడుకుంటున్న వీడియోను నిష్కా తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది తారకరత్న హిందూపూర్ కు వెళ్లడానికి ముందు కూతురితో కలిసి Subway Surf గేమ్ ఆడారు.. ఆ సమయంలో తారకరత్న చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియోకు రికార్డు స్థాయిలో లైక్స్ కూడా వస్తున్నాయి. తారకరత్న కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే నిష్కా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో తండ్రి తో కలిసి దిగిన ఫోటోను డీపీగా పెట్టుకున్నారు.

తండ్రి పై నిష్కకు ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదని.. ప్రతి సంవత్సరం నిస్కా పుట్టినరోజును ఆయన చాలా గ్రాండ్గా చేశారని తెలుస్తోంది. ఇక తన పుట్టినరోజుకు నాలుగు రోజుల ముందు తారకరత్న మరణించడం అభిమానులను ఎంతగానో కలవరపెడుతోంది. తారకరత్న సైతం ఇండస్ట్రీలో అందరివాడిగా పేరు తెచ్చుకున్నారు. నందమూరి కుటుంబంలో అందరితో స్నేహపూర్వకంగా మెలిగారు. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ముందుండే తారకరత్న ప్రస్తుతం మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు ఒంటరి అయ్యారని తెలుస్తోంది. ఇకపోతే పైకి బాగానే కనిపిస్తున్న నిష్కా లోపల తండ్రిని తలచుకొని ఆవేదన చెందుతున్నట్లు తన వీడియోల ద్వారా స్పష్టం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version