నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తిని చితకబాదిన టీడీపీ నేతలు

-

నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఖమ్మం టీడీపీ నాయకులు విరుచుకుపడ్డారు. ఆ వ్యక్తిని గుర్తించి అతడికి దేహశుద్ధి చేశారు.

ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కోదాటి నరసింహ అనే వ్యక్తి ఖమ్మం టేకులపల్లిలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. తన ఫేస్‌బుక్‌లో ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణిపై అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా కించపరుస్తూ పోస్టులు పెట్టాడు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కేతినేని హరీశ్‌, నల్లమల రంజిత్‌, నున్నా నవీన్‌, వక్కంతుల వంశీ తదితరులు కోదాటి నరసింహను చరవాణిలో ప్రశ్నించటంతో ముస్తఫానగర్‌ వైతెపా కార్యాలయంలో ఉన్నానని చెప్పారు. అక్కడికి వెళ్లి వ్యక్తిగతంగా ఎందుకు పోస్టులు పెట్టావని అడగటంతో దురుసుగా సమాధానం చెప్పాడు.

ఆగ్రహానికి గురైన నాయకులు సదరు వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం టీడీపీ లోక్‌సభ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నారా, నందమూరి కుటుంబాలకు చెందిన వ్యక్తులపై వ్యక్తిగతంగా అసభ్య పదజాలం వాడితే సహించేది లేదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news