అప్పుల్లో తెలంగాణ దేశంలోనే 25వ స్థానంలో ఉంది: సీఎం కేసీఆర్

-

ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా పాటించడంతో దేశంలోని 28 రాష్ట్రాల్లో అప్పుల్లో 25వ స్థానంలో ఉన్నామని.. మన కన్నా 24 రాష్ట్రాలు ఎక్కువగా అప్పుచేశామని.. మన అప్పుల శాతం కేవలం 23 శాతమే అని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలించే రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేశాయని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు అప్పులు కూడా వనరులే సమీకరణే అని ఆయన అన్నారు. దేశానికి పెద్దగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ల పాలసీలు కరెక్ట్ గా లేదని సీఎం విమర్శించారు. బలమైన కేంద్రం… బలహీనమైన రాష్ట్రాలుగా పాలసీని కేంద్రం అవలంభిస్తోందని విమర్శించారు. రానున్న కాలంలో ఇది సమస్యలకు దారి తీస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం అని కేంద్ర ప్రభుత్వ చేస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రం పనితీరు మన కన్నా దారుణంగా దిగజారిందని కేసీఆర్ అన్నారు. పర్ కాపిటీ ఇన్మమ్, జీడీపి చూసినా.. మన కన్నా దారుణంగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశం అప్పులు 152 లక్షల కోట్లు ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం అప్పుల శాతం 58.5 శాతం వరకు అప్పులు తీసుకుంది… రాష్ట్రాలు మాత్రం 25 శాతం మించొద్దని ఆంక్షలు విధిస్తోందని .. వాళ్లు ఇష్టం వచ్చినట్లు నిధుల సమీకరణ చేస్తుందని.. రాష్ట్రాలను తొక్కిపెడుతుందని కేసీఆర్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news