నేడు అసెంబ్లీకి రానున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 7వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి.అయితే ఇవాళ బడ్జెట్ సమావేశాల చివరి రోజు కానున్న నేపథ్యంలో… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. అసెంబ్లీకి రానున్నారు.

అసెంబ్లీకి వచ్చి… ఉద్యోగాల నోటిఫికేషన్, ప్రతి పక్షాలకు కౌంటరు, బడ్జెట్ అంశాలపై సీఎం కేసీఆర్ ప్రస్తావించనున్నారు. దాదాపు రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉంది. కాగా నాలుగు రోజుల కింద సీఎం కేసీఆర్ అనారోగ్యం తో ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే.

గుండె సంబంధిత పరీక్షల కోసం సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్ వెళ్లారు. డాక్టర్లు నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పడంతో… ఆయన అసెంబ్లీ కి రాలేదు. ఇక ఇవాళ చివరిరోజు కానున్న నేపథ్యంలో అసెంబ్లీ కి నేరుగా సీఎం కేసీఆర్ రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news