తెలంగాణలో కరోనా విలయం.. వెయ్యికి చేరువలో కొత్త కేసులు..

-

యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో… తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 800 దాటింది. గత కొన్నిరోజులుగా కరోనా కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 38,122 శాంపిల్స్ పరీక్షించగా, 836 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 443 కొత్త కేసులు నమోదయ్యాయి.

Telangana, AP Coronavirus July 4 HIGHLIGHTS: Eight deaths each in AP,  Telangana in last 24 hours | Cities News,The Indian Express

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 55, రంగారెడ్డి జిల్లాలో 52, కరీంనగర్ జిల్లాలో 35 కేసులు గుర్తించారు. అదే సమయంలో 765 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేమీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,17,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,08,270 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,986 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.

 

Read more RELATED
Recommended to you

Latest news