తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు… కొత్తగా 322 కేసులు

-

తెలంగాణలో కరోనా వైరస్‌ రోజు రోజు తగ్గుముఖం పడుతోంది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 322 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 6,58,376 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3876 మంది కరోనా మహమ్మారి తో మరణించారు.

ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 5,852 గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,48, 876 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 331 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 98.52 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 97.48 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.58% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71, 402 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 2,47,05, 048 కు చేరుకుంది. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కేసులు… ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news