నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

-

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తెలంగాణ 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిపాటు వైభవంగా వేడుకలు నిర్వహిస్తోంది. మూడు రోజులపాటు ప్రారంభ కార్యక్రమాలు జరగనున్నాయి. రేపు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకావిష్కరణ చేస్తారు.

ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. చారిత్రక సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని సెంట్రల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిస్తారు.

అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు జాతీయ జెండా ఎగరవేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు మున్సిపాలిటీ, పంచాయతీ కేంద్రాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌లో బంజారా, ఆదివాసీ భవన్‌లను సీఎం జాతికి అంకితం చేస్తారు

Read more RELATED
Recommended to you

Latest news