Telangana : సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా

-

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

త్వరలోనే ప్రారంభోత్సవ తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈనెల 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. సచివాలయ ప్రారంభోత్సవ అంశంపై సీఈసీని సీఎస్‌ శాంతికుమారి సంప్రదించారు. సీఈసీ నుంచి ఆశాజనక స్పందన రాకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news