2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాల్సిందే : బండి సంజయ్

-

25 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. నిన్న సీఎం కేసీఆర్‌ వనపర్తిలో మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ బండి సంజయ్‌ మాట్లాడారు. నిరుద్యోగులారా…. తస్మాత్ జాగ్రత్త… అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మరోసారి మోసం చేయబోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షా 91 వేల ఉద్యోగాలిచ్చేదాకా వదలిపెట్టే ప్రసక్తే లేదని.. బకాయిలతో సహా నిరుద్యోగ భ్రుతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

పదివేలో, 20 వేలో ప్రకటించి చేతులు దులుపుకుంటానంటే ఊకునేది లేదని.. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇయ్యాల్సిందేని హెచ్చరించారు. అదేదో గొప్పగ చెబుతున్నవ్? నీ ఇంట్లకెళ్లి ఇస్తున్నవా? ఈ 8 ఏళ్లలో ఎంతమంది నిరుద్యోగులను బలి తీసుకున్నవ్? అంటూ నిప్పులు చెరిగారు బండి సంజయ్‌.

కాషాయ జెండాను, బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతవా? నీకా దమ్ముందా? అని సవాల్‌ విసిరారు. దేశంలో పచ్చ జెండా ఎంఐఎం ఎజెండాను విస్తరింపజేయడానికి ప్రణాళిక చేస్తున్నవా? నీలాంటి కొన్ని వందల మంది బీజేపీని కనుమరుగు చేద్దామని రహస్య ఎజెండాను అమలు చేసి తీరా ఏమీ చేయలేక కనుమరుగైపోయారని నిప్పులు చెరిగారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడున్నది? కమ్యూనిస్టులు ఎక్కడున్నరు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version