కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఏఐసీసీ

-

టిపిసిసి స్టార్ క్యాంపైనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఇటీవల మునుగోడులో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫోన్ కాల్ చేసిన మాటలు రికార్డు అయిన విషయం తెలిసిందే. ఓ కాంగ్రెస్ లీడర్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ గా ఉండి ఈ రకంగా ప్రవర్తించడంపై అధిష్టానం సీరియస్ అయింది. వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెంకట్ రెడ్డి పై పార్టీ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. అయితే చర్యలు ఎందుకు తీసుకోకూడదో 10 రోజులలో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొంది ఏఐసీసీ.

Read more RELATED
Recommended to you

Latest news