ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్

-

తెలంగాణలో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో గురువారం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ఎవిడెన్స్ ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.

సీఎం ఇచ్చిన ఎవిడెన్స్ ను చూసి తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పెన్ డ్రైవ్ లు, సిడీలు సీఎం కేసీఆర్ కోర్టుకి పంపించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా రేపు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో నని అందరిలో ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news