మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. మంత్రాల నెపంతో తల్లి, కొడుకు హత్య

-

మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో తల్లి, కుమారుడిని దారుణంగా హత్య చేశారు. ఈ విషాదకర సంఘటన గూడూరు మండలం కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుమారస్వామి అనే వ్యక్తి ఇనుప రాడ్‌తో కొట్టి చంపాడు.

కాగా.. ఏడు సంవత్సరాలుగా ఇరు కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులు సమ్మక్క, కుమారుడు సమ్మయ్య బొల్లేపల్లి గ్రామానికి చెందిన వారు అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version