సిరిసిల్లలో దారుణం.. పాతకక్షలతో ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య

-

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పాత కక్షలతో నేవూరి నర్సయ్య (42) అనే వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.కిషన్ అనే వ్యక్తి ట్రాక్టర్ తో ఢీకొట్టడంతో నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కిషన్ అనే వ్యక్తి నర్సయ్యను హత్య చేసేందుకు కుట్ర చేసినట్లు బంధువులు ఆరోపించారు. హత్య చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని తెలియడంతో పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు బాధితుని బంధువులు.

దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్టేషన్ పై దాడి చేసి అడ్డొచ్చిన పోలీసులను కూడా చితకబాదారు బంధువులు. రుద్రంగి ఎస్ఐ మరియు చందుర్తి సీఐ మృతుని పట్ల వ్యవహరించిన తీరుపై బంధువులు మండిపడ్డారు. మృతున్ని అకారణంగా కేసులు పెట్టి హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని ఎంతగానో హింసించావని.. నా భర్త పోయాడు ఇక తాళి తీసుకో అంటూ చందుర్తి సీఐ శ్రీలతకు తాళిని తీసి ఇచ్చింది మృతుని భార్య. సంఘటన స్థలానికి చేరుకున్నారు వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి. ఆందోళనకారులను అదుపు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news