BREAKING : త్వరలోనే బండి సంజయ్‌ బస్సు యాత్ర

-

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో బండి సంజయ్‌ బస్సు యాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ముందస్తు ఎన్నికలు వస్తే పాదయాత్రకు బదులు బస్సుయాత్ర నిర్వహించే ఆలోచనలో బండి సంజయ్ కుమార్ ఉన్నారని సమాచారం అందుతుంది.

ఇందులో భాగంగానే పది రోజుల్లో ముగించేలా బస్సుయాత్ర ప్లాన్ చేస్తున్నారు. అంతె కాదు పాదయాత్ర, జిల్లా సమీక్షలతో బిజీగా ఉన్నారు బండి సంజయ్‌. అన్ని ఓకే అయితే బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు బండి సంజయ్ కుమార్.

కాగా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. లిక్కర్ దందాలో నీ బిడ్డకు సీబీఐ నోటీసులిస్తే.. తెలంగాణ ప్రజలెందుకు ఉద్యమించాలే? డ్రగ్స్, లిక్కర్, క్యాసినో, రియల్ ఎస్టేట్, గ్రానైట్ దందాల్లో కేసీఆర్ కుటుంబం పెట్టుబడులు అని ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news