BREAKING : ఎలక్షన్ కమిషన్ కు బండి సంజయ్ లేఖ..పరీక్షలు వాయిదా వేయండి !

-

BREAKING : ఎలక్షన్ కమిషన్ కు బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణలోని అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కోరారు బండి సంజయ్‌. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేలా..తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి అయ్యే వరకు పరీక్షలను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు బండి సంజయ్.

ఇక ఇది ఇలా ఉండగా… బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలిద్దరూ భూకబ్జాదారులేనని అంతకు బండి సంజయ్‌ విమర్శలు చేశారు. బిజెపిని గెలిపిస్తే బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిన స్థలంలో బుల్ డోజర్లు దించి, వాటిని స్వాధీన పరుచుకుని, ఆ స్థలాల్లో పేదలకు ఇల్లు కట్టిస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలు ఏమైనా మీ అయ్య జాగిరి అనుకున్నారా ? భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనిఫైర్‌ అయ్యారు. నన్ను గెలిపిస్తే వాళ్ళ సంగతి తేలుస్తానని… నగునూరులోని దుర్గామాత గుడి సమీపంలో 669 సర్వే నెంబర్, 26 ఎకరాల భూమిని బిఆర్ఎస్ నేతలు కబ్జా చేశారన్నారు. నన్ను గెలిపిస్తే ఆ జాగలను స్వాధీనం చేసుకొని, పేదలకు అంచి పెడతానని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version