ఇవాళ 15 కిలో మీటర్లు కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కుమార్‌… రాష్ట్రంలో మూడో పాదాయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 17 వ రోజులో జనగామ జిల్లాలో కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగంలో 4వ రోజు కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో నేడు 15 కిలో మీటర్లుదూరం పాదయాత్ర కొనసాగించనున్నారు.

జనగామ రెడ్డి సంఘం భవనం నుండి ప్రారంభం అయ్యి చీటకోడూరు,చౌడారాం,బాషా తండా,రామచంద్ర గూడెం, లక్ష్మి తండా,మందారం గ్రామాల మీదుగా ఖిలశాపూర్ వరకు సాగనుంది బండి సంజయ్ పాదయాత్ర. ఖిలశాపూర్ వద్ద రాత్రి బస చేయనున్న..బండి సంజయ్‌… అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా పట్టణంలో యాత్ర శిబిరం వద్ద ఉదయం 10 గంటలకు మీడియా ఫోటో గ్రాఫర్లను సన్మానించనున్నారు. ఆ తర్వాత.. మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news