బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఎంపీ అరవింద్

-

తెలంగాణ బిజెపిలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్ధించబోరని స్పష్టం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హోదా పవర్ సెంటర్ కాదని.. అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది అంటూ వ్యాఖ్యానించారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు ధర్మపురి అరవింద్. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రత్యర్ధులకు ఆయుధాలుగా మారాయని, ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక ఈడీ విచారణకు కవిత సహకరిస్తే మంచిదని అరవింద్ అభిప్రాయపడ్డారు. లేదంటే వీలైనంత త్వరలో కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news