నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు..!

-

హైదరాబాద్ అంటేనే లేక్స్, రాక్స్. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రతి పనికి నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నారు అన్నారు.

ఇక బఫర్ జోన్ లో కాదు, నేరుగా చెరువులోనే కఠిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు. సాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నాం. రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఫోటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతాము. చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నాం. లెక్కలతో సహా అన్నీ ప్రజల ముందు పెడతాము. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని భట్టి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version