సెప్టెంబర్ 5న విచారణకు రండి.. కేసీఆర్కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు

-

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు మరో నోటీసు అందింది.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో  వైఫల్యాలపై విచారణకు హాజరు కావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్తో పాటు హరీశ్ రావు సహా మొత్తం 8 మందికి న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

లక్ష కోట్ల రూపాయలు వ్యయం చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు నాటి కేసీఆర్ సర్కారే కారణమని రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో రివిజన్ పిటీషన్ దాఖలు చేశార. ఈ ప్రాజెక్టు వల్ల భారీగా ప్రజా ధనం దుర్వినియోగం అయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోర్టుకు విన్నవించారు.

ప్రాజెక్టు వ్యయాన్ని పెం .ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. నిర్మాణంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. మేడిగడ్డ నిర్మాణ సంబంధించిన పలు టెక్నికల్ అంశాలను డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరినా ఇవ్వకుండా లోపాలను దాచే ప్రయత్నం చేశారు. అని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version