అదానీ ఇష్యూ.. పార్లమెంట్‌లో మరోసారి బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

-

పార్లమెంటులో అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక అంశంపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉభయసభల్లో ఈ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది కాస్తా పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. దాంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

ఈ క్రమంలో ఉభయసభల్లో అదానీ-హిండెన్‌బర్గ్‌ రిపోర్టుపై చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇండియన్ వర్క్ నివేదిక ఆధారంగా సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. ఈ అంశం పైనే మరికాసేపట్లో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్షాలు భేటీ కానున్నాయి. ఉదయం 10 గం.ల నుంచి గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించాయి. తదుపరి కార్యాచరణను ఈరోజు చర్చించి ఖరారు చేయనున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్‌తో పాటు డీఎంకే పార్టీ కూడా ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news