బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయి.. బండి సంజయ్ సెన్షేషనల్ కామెంట్స్

-

బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా కోర్టులపై తనకు ఎంతో గౌరవం ఉందని.. కవిత బెయిల్ పై చేసిన కామెంట్స్ కి వివరణ ఇచ్చారు. ఈ అంశం పై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ.. నేను విషయం లేవనెత్తిన తరువాత లాయర్ ని మార్చారంటున్నారు.

హైడ్రా ఒక కక్ష సాధింపు చర్యలా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అన్ని ఆక్రమణల విషయంలో ఒకేలా వ్యవహరించడం లేదన్నారు. సల్కం చెరువు ఆక్రమణలు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఒవైసీ కాలేజీకి మాత్రం ఏడాది సమయం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అందరికీ ఒకే న్యాయం అయితే.. ఒవైసీ కాలేజీని కూల్చాలని పేర్కొన్నారు. హైడ్రా తెలంగాణ రాష్ట్రంలో ఓ దుమారం రేపుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండు ఒక్కటేనని.. 2028లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version