బండి సంజయ్ చిల్లర మాటలు మానుకోవాలి : జగదీష్ రెడ్డి

-

కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలకి BRS లీడర్ జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ బీజేపీ నాయకుడు అనే విషయాన్ని మర్చిపోయారు. రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు అని అన్నారు. అలాగే కేటీఆర్ పైన బండి సంజయ్ అక్కసు వెళ్లగక్కుతున్నారు అని పేర్కొన జగదీష్ రెడ్డి.. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి. రేవంత్ రెడ్డిని కాపాడాలని బండి సంజయ్ ఉత్సాహపడుతున్నారు అని పేర్కొన్నారు.

ఇక బండి సంజయ్ చిల్లర మాటలు మానుకోవాలి. ఆయన కేంద్ర మంత్రిలా కాకుండా కరీంనగర్ లో కార్పోరేటర్ గా మాట్లాడుతున్నారు అని అన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య ఐఖ్యత ఎక్కడిది. డబ్బుల సంచులతో దొరికి రేవంత్ రెడ్డి, పేపర్లు లీక్ చేసి బండి సంజయ్ జైలుకు వెళ్లారు. పైన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆక్సిజన్ తో నడుస్తోంది. మిలాఖత్ ఉంటే కేటీఆర్ బామ్మర్ధి ఇంటిపై రేవంత్ రెడ్డి ఎందుకు దాడి చేయిస్తారు అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version