ఈనెల 14 నుంచి అందుబాటులోకి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ – ఎంపీ నామా నాగేశ్వరరావు

-

ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు బిఆర్ఎస్ ఎంపీలు నామ నాగేశ్వరరావు , రాములు, ఎర్రబెల్లి దయాకర్ రావు, బడుగు లింగ యాదవ్, బిబి పాటిల్. ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఈనెల 14 నుంచి అందుబాటులో ఉంటుందన్నారు. తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని.. పక్కనున్న రాష్ట్రాలు కూడా తెలంగాణ అభివృద్ధిలా కోరుకుంటున్నాయన్నారు.

పార్లమెంట్ లో పక్క రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా చర్చించుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో రైతు సంక్షేమ పార్టీ అధికారంలోకి రావాలనేదే మా ధ్యేయం అన్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని పనులు ఈ రాష్ట్రంలో చేశామన్నారు నామా.బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పార్టీ స్థాపించామన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ఎంపీ నామ నాగేశ్వరరావు. బిఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కి కొంతమంది జాతీయ నాయకులను ఆహ్వానించామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news