రాష్ట్రంలో రెండు రోజులపాటు మత ఘర్షణలు చేయడానికి ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నాడు: బండి సంజయ్

-

రాష్ట్రంలో రెండు రోజులపాటు మత ఘర్షణలు చేయడానికి సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ముఖ్యమంత్రి ఆదేశాలతో, సీఎంఓ ఆదేశాలతో అరెస్ట్ చేయడం పై నిరసన దీక్షలు జరుగుతున్నాయన్నారు. కుంటి సాకులతో అర్థం పర్థం లేని ఆరోపణలతో సంగ్రామ యాత్ర కు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. ప్రజల్ని కలవాల్సిన ముఖ్యమంత్రి వాల్లని కలవలేదు, పట్టించుకోవట్లేదన్నారు. కేసీఆర్ కుటుంబం మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు రావడం వల్లనే మమ్మల్ని అడ్డుకుంటున్నారని అన్నారు బండి సంజయ్.

తన బిడ్డను కాపాడుకోవడానికి నన్ను అరెస్ట్ చేసి డైవర్ట్ చేస్తున్నాడని ఆరోపించారు. కవిత ఇంటి దగ్గర మా వాళ్ళను కొట్టాడని.. రాష్ట్రంలో ఎక్కడ ఐటి దాడులు చేసిన వారి పేరే వస్తుందన్నారు. అన్ని అక్రమ వ్యాపారాల్లో కేసీఆర్ కుటుంబం పేరే ఉంటుందన్నారు బండి సంజయ్. 1400 మంది చనిపోతే ఆ శవాల మంట మీద ముఖ్యమంత్రి చలి కాచుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. ఎంఐఎం తో కలిసి కుట్రలు జరుగుతున్నాయని.. బీజేపీ కి మైలేజ్ తగ్గించాలని మత ఘర్షణ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను బెదిరించి బీజేపీ మీద దాడులు చేయాలని చెబుతున్నారని అన్నారు. రాజ్యాంగ బద్దంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నామని తెలిపారు. అక్రమ వ్యాపారాలు, అడ్డగోలు దండాలపై ప్రశ్నిస్తున్నామన్నారు బండి సంజయ్. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సంగ్రామ యాత్ర ఆపేదే లేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news