BREAKING : పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీకాలం పొడగింపు

-

టిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్గా పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీ కాలాన్ని సీఎం కేసీఆర్ పాడగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్ పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు సీఎం కేసీఆర్ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తన పదవీ కాలాన్ని పొడిగించిన సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన ఈ అవకాశాన్ని తాను మరింత సద్వినియోగం చేసుకుంటానని వివరించారు. తెలంగాణ రైతుల కోసం అలాగే వ్యవసాయ అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తానని హామీ ఇచ్చారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news