నేడు హైదరాబాద్ కు తిరిగి రానున్న సీఎం కేసీఆర్ !

-

ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరంగల్‌ లో ఉన్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై నిన్న సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసి, కరకట్టను పరిశీలించారు. అక్కడినుండి భద్రాచలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ముంపు బాధితులను పరామర్శించారు.

వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసరాలు, వైద్యం, ఇతర సౌకర్యాల గురించి సీఎం ఆరా తీశారు. అనంతరం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ముంపు ప్రాంతాలను సీఎం కేసీఆర్‌ పరిశీలించి… వారికి భరోసా కల్పించారు. ఇవాళ రాష్ట్రపతి ఎన్నికలు ఉన్ననేపథ్యంలోనే.. సీఎం కేసీఆర్‌.. ఉన్న ఫలంగా హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సీఎం కేసీఆర్‌.. హైదరాబాద్‌ రానున్నారని సమాచారం అందుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news