BREAKING : బీజేపీలో చేరిన దాసోజు శ్రావణ్

-

BREAKING : భారతీయ జనతా పార్టీలో దాసోజు శ్రవణ్ కుమార్ చేరారు. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బిజెపిలో చేరారు దాసోజు శ్రవణ్. ఈ జాయినింగ్ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, బిజెపి ఎంపీ లక్ష్మణ్, మురళీధర్ రావు హజరు అయ్యారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ…మోడీ నాయకత్వం లో ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుంది..బీజేపీ పట్ల చాలా మంది ఆకర్షితులు అవుతున్నారన్నారు. తెలంగాణ లో కుటుంబ పాలనకు బిజిపి ప్రత్యామ్నాయం అని .టీఆరెస్ కు ప్రత్యామ్నాయం గా జరిగే పోరాటం మరింత బలోపేతం కానుందని వెల్లడించారు.

ఉద్యమకారులను కేసీఆర్ పక్కన పెట్టారు…క్యాబినేట్ లో పదిమంది బయటి వాళ్లే ఉన్నారని ఫైర్ అయ్యారు.బిజెపి లోకి చేరికలు పెరిగాయి..ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పే కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. అవినీతి రాజ్యం పోవాలి..బిజెపి రావాలి అందరూ కోరుకుంటున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news