తెలంగాణలో డెంగీ పంజా..5500 కేసులు క్రాస్‌ !

-

Dengue claws in Telangana: తెలంగాణ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు డెంగీ కేసులు 5,500 కు పైనే నమోదయ్యాయి. ప్రతీ రోజూ 100 కు పైగా అనేక జిల్లాల్లో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో హైదరాబాద్ లో 2148 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ లో 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ లో 120 డెంగీ కేసులు నమోదు అయ్యాయి.

Dengue claws in Telangana

మేడ్చల్ మల్కాజ్గిరిలో 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైరల్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో నిలోఫర్ ఆసుపత్రి పరిస్థితి మరింత దారుణం తయారైంది. సరిపడ బెడ్స్ లేక ఒక్కో బెడ్ పై ఇద్దరికీ పైగా పేషంట్స్ ఉంటున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version