ఇలాంటి దాడులకు భయపడం – వైఎస్ షర్మిల

-

వరంగల్ జిల్లా నర్సంపేటలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 223వ రోజు కొనసాగుతోంది. ఆదివారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై వైయస్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే నేడు షర్మిల పాదయాత్రను టిఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటారనే ప్రచారం ఉదయం నుంచే సాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

అయినప్పటికీ టిఆర్ఎస్ కార్యకర్తలు వైయస్ షర్మిల పాదయాత్ర ని అడ్డుకున్నారు. దీంతో పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లింగగిరి గ్రామంలో పాదయాత్ర బస్సు పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. కిరోసిన్ పోసి బస్సును కాల్చే ప్రయత్నం చేశారు టిఆర్ఎస్ కార్యకర్తలు. మంటలు వ్యాపిస్తుండగా ఆ మంటలను వైటిపి కార్యకర్తలు ఆర్పేశారు. అనంతరం టిఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్ర వాహనాలపై రాళ్లూరువారు. షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన పాదయాత్రని అడ్డుకొని, తనని అరెస్టు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

పాదయాత్రలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి యాత్రను అడ్డుకునేందుకే బస్సును తగలబెట్టారని మండిపడ్డారు. పోలీసులు దగ్గరుండి దాడి చేయించారని ఆరోపించారు షర్మిల. బస్సుకు నిప్పంటించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులకు భయపడబోమని.. ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్రను ఆపేదే లేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news