బిజెపి పండుగకు కేసిఆర్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు – ఈటెల రాజేందర్

-

పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను పరిశీలించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి కి తెలంగాణ 20వ రాష్ట్రం కానుందని తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్ఎస్ ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని కేసీఆర్ దోచుకోవడం వలనే ప్రభుత్వ ఖజానా మొత్తం దివాలా తీసిందని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసిఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు.

33 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసి నగరంలో హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని.. కెసిఆర్ ముఖం చూడడానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పై ప్రజలకు వ్యతిరేకత ఎంతగా పెరిగిందంటే కెసిఆర్ వార్త వస్తుంటే ప్రజలు టీవీ ఛానల్ బంద్ చేసేంతగా ఉందని అన్నారు. బిజెపి పండుగకు కెసిఆర్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని.. తెలంగాణలో చెల్లని కెసిఆర్ ముఖం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బెంగాల్ లో చెందుతుందా? అని అన్నారు. తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దేశాన్ని ఏలుతాడా? అంటూ ఎద్దేవా చేశారు ఈటెల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news