మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ సేవలు మరువలేనివి : కేంద్ర మంత్రి బండి సంజయ్

-

రాథోడ్ రమేష్ గారి మరణ వార్త కలచివేసిందని, వారి సేవలు మరుపలేనివి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మృతిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన తన సంతాపం తెలియజేశారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపి నేత రాథోడ్ రమేష్ గారు అనారోగ్యంతో మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.

ఆదిలాబాద్ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా వారు అందించిన సేవలు మరువలేనివని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం వారు చేసిన కృషి అసామాన్యమని కొనియాడారు. రమేష్ రాథోడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు, అభిమానులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని బండి సంజయ్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version