సీఎం కేసీఆర్, స్టాలిన్ లపై గవర్నర్ తమిళసై వివాదాస్పద వ్యాఖ్యలు

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు తమిళనాడు సీఎం స్టాలిన్లపై గవర్నర్ తమిళ సై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ లాగానే సీఎం స్టాలిన్ కూడా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళ సై.

నిన్న పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. సంప్రదాయ ప్రకారం గవర్నర్ తేనేటి విందుకు ఏర్పాటు చేస్తారు. అలాగే గవర్నర్ తమిళ సై కూడా తేనేటి విందును ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ వెళ్లలేదు.

ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. అయితే ఈ వ్యవహారంపై గవర్నర్ తమిళసై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తీరు నన్ను చాలా బాధించిందని… నా తేనేటివి ఎందుకు స్టాలిన్ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కెసిఆర్ మూడోసారి కూడా ఇలాగానే వ్యవహరించారని మండిపడింది గవర్నర్ తమిళ సై. ఇక అటు తెలంగాణ బిజెపి నేతలు కూడా ఈ విందుకు హాజరు కాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version