మునుగోడు ఉప ఎన్నిక పై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

-

మునుగోడు ఉప ఎన్నిక పై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తెస్తామని బీజేపీ చెబుతోందని.. ఈ ఉప ఎన్నిక ఎందుకు? అని ప్రశ్నించారు. రాజకీయ ఉపేక్ష, రాజకీయ ఆరాటం కోసమే ఈ ఉప ఎన్నిక.. ప్రజల మీద బీజేపీకి ప్రేమ ఉంటే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి డిమాండ్ చేశారు మంత్రి హరీష్‌రావు. వరంగల్ కి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు…బయ్యారంకి ఉక్కు ఫ్యాక్టరీ లేదని ఫైర్ అయ్యారు.

ఉపాధి హామీ పథకం కోసం మనిషికి మెషిన్ లు పెడుతారట అని చురకలు అంటించారు గ్యాస్ సబ్సిడీ తీసేసారని…ఉన్న ఉద్యోగాలు పోయాయని మండిపడ్డారు. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి…ఉచితాలు ఇవ్వొద్దని ప్రధాని చెబుతున్నారని ఆగ్రహించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. టిఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా ఎవరికీ లేదని తేల్చి చెప్పారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news