సీఎం రేవంత్ కు సవాల్ విసిరిన హరీష్ రావు..!

-

సిగ్గులేకుండా మల్లన్నసాగర్ నిర్వాసితులకు కేసీఆర్ అన్యాయం చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మూసి బాధితులకు సీఎం రేవంత్ ఏం న్యాయం చేశారు అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాంగ్రెస్ తెచ్చిన భూ చట్టం కంటే మెరుగైన సహాయం మేము చేశాము. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక్క ఇల్లు అయిన కట్టించారా అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఒక్క గజ్వేల్ లొనే 3 వేలకు పైగా ఇల్లు కట్టి మేము నిర్వాసితులకు ఇచ్చాము. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులపై కాంగ్రెస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారు. మూసి నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్, 25 వేల రూపాయలు ఖర్చుకు ఇస్తున్నామని సీఎం రేవంత్ గొప్పలు చెబుతున్నారు.

మల్లన్న సాగర్ భూ సేకరణ చేసినప్పుడు పాత ఇంటికి రెండింతలు నష్ట పరిహారం ఇచ్చాము. దీని కోసం 694 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఇంటి యజమాని, భార్యకు 7 లక్షల 50 వేలు ఉపాధి కోసం ఇచ్చాము. ఇంట్లో 18 ఏళ్ళు దాటిన పెళ్లికాని వారికి ఉపాధి కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చాము. అందరికి ఇల్లు కట్టి ఇచ్చాము..పెళ్లి కాని వారికి కూడా 250 గజాల స్థలం ఇచ్చాము. ఖర్చులకు 30 వేల నుంచి 50 వేల రూపాయలు ఇచ్చాము. గజ్వేల్ నడిబొడ్డున డబుల్ రూమ్ ఇల్లు కట్టి ఇచ్చాము. మూసి బాధితులకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రేవంత్ ఇచ్చి గొప్పలు చెబుతున్నారు. నీకు దమ్ముంటే గజ్వేల్ లో కేసీఆర్ ఇండ్లు కట్టిచ్చినట్టు కట్టివ్వాలి అని హరీష్ రావ్ సవాల్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version