Kaleshwaram: అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో భారీగా ఇసుక మేటలు !

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధికారులు హడావిడి చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో భారీగా ఇసుక మేటలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇసుక మేటలపై టోపోగ్రాఫికల్ శాండ్ సర్వే నిర్వహించారు ఓ ప్రైవేటు ఏజెన్సీ అధికారులు.

Heavy sand mining in Annaram Saraswati Barrage in Kaleswaram Project

బ్యారేజ్ కు ఎగువన పేరుకుపోయిన ఇసుకతో పాటు 4,5,6 బ్లాకుల్లోని 18 గేట్లు, వెంట్ల వద్ద సర్వే నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ యాదగిరి,డీఈ రవీందర్ నేతృత్వంలో ఈ సర్వే జరిగినట్లు చెబుతున్నారు. లక్షల క్యూబీక్ మీటర్ల ఇసుక పేరుకుని ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై తెలంగాణ సర్కార్ కు నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version