మరో పోరాటానికి సిద్ధమైన ఉస్మానియా యూనివర్సిటీ

-

మరో పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైoది. దీంతో…నేడు, రేపు క్యాంపస్ లో హై అలెర్ట్ ప్రకటించారు. TSPSC పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం వ్యక్తంచేశారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేడు, రేపు ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకి ప్లాన్ చేసారు విద్యార్థులు.

దీక్షకి పర్మిషన్ లేదంటున్న యూనివర్సిటీ అధికారులు…దీక్ష చేస్తే కేసులు తప్పవంటున్నారు ఓయూ పోలీసులు.దీక్ష చేసి తీరుతామని చెబుతున్నారు విద్యార్థి సంఘాలు.క్యాంపస్ లోకి ప్రతిపక్ష నాయకులు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు అధికార పార్టీ విద్యార్థి సంఘం.ప్రతిపక్ష నాయకుల రాకను స్వాగతిస్తున్నారు విప్లవ వామపక్ష విద్యార్థి సంఘాలు.

 

TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని విద్యార్థుల డిమాండ్ చేస్తున్నారు. జ్యూడిషియల్ విచారణకి పట్టుపడుతున్నారు విద్యార్థులు.విద్యార్థులను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు ఓయూ పోలీసులు.ముందస్తు అరెస్ట్ లపై భగ్గుమంటున్నారు ఓయూ విద్యార్థులు. క్యాంపస్ కి వచ్చే అన్ని గేట్లను మూసేసింది ఓయూ సెక్యూరిటీ.

Read more RELATED
Recommended to you

Latest news