అక్కినేని నాగర్జున పంచాయితీ…మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం !

-

మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కేసును సుమోటో గా పరిగణలోకి తీసుకుంది సీజే ధర్మాసనం. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సిజేకు లేఖ రాశారు హైకోర్టు న్యాయమూర్తి.

High Court angry with Medak MP Raghunandan Rao

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే పై రఘునందన్ వ్యాఖ్యలు చేశారన్న న్యాయమూర్తి… ఆగస్టు 24న రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి న్యాయవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

న్యాయవ్యవస్థ పట్ల రఘునందన్ రావు అగౌరవం కలిగి ఉన్నారని లేఖలో పేర్కొన్న న్యాయమూర్తి… ఇలాంటి వ్యాఖ్యల వల్ల న్యాయస్థానం ప్రతిష్ట మసకబారుతుందని లేఖలో వెల్లడించారు. ఈ తరుణంలోనే.. కోర్టు ధిక్కరణ పిటిషన్ గా ఎందుకు పరిగణనలోకి తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ రఘునందన్ రావుకు నోటీసులు జారీచేసింది సీజే ధర్మాసనం.

Read more RELATED
Recommended to you

Exit mobile version