మాదాపూర్ లో భారీ పేలుడు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

-

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో భారీ పేలుడు సంభవించింది. ఓ గుడిసె హోటల్ లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే పేలుడు కారణంగా భారీ మంటలు చెలరేగాయి. హోటల్ లో కార్మికులు సేఫ్ గా బయటపడ్డారు. వంట చేస్తుండగా రెండు సిలిండర్లు పేలిపోవడంతో హోటల్ దగ్ధమైంది.

సాయి నగర్ నుండి అయ్యప్ప సొసైటీ కి వెళ్లే రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ ఏమైందో తెలుసుకునే లోపే ఒకదాని తర్వాత మరో సిలిండర్ పేలి హోటల్ లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో చుట్టుపక్కల జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలు అదుపు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version