మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు !

-

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ సభలో రేవంత్ రెడ్డి ప్రకటన ను తప్పుపట్టారు చిత్తరంజన్ దాస్. తెలంగాణ ఉద్యమం, సాధన లో జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి లు ఎక్కడున్నారని ప్రశ్నించారు చిత్తరంజన్ దాస్. ఆ సమయంలో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో లేరని అన్నారు.

కెఎల్ఐ ప్రాజెక్ట్ కు జైపాల్ రెడ్డి పేరు ఎలా పెడతారు? అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్ట్ సాధన లో ఆయన పాత్ర లేదన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కల్వకుర్తి ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు చిత్తరంజన్ దాస్. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కల్వకుర్తి ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news