ఈటెల రాజేందర్ పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ముదిరాజ్ కులస్తులను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారంటూ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ముదిరాజ్ కులస్తులు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ముదిరాజ్ కులాన్ని ఇంచపరుస్తూ కౌశిక్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసన తెలుపుతున్నారు ముదిరాజ్ కులస్తులు. అయితే ఈమధ్య తరచూ వివాదాలలో చిక్కుకుంటూ పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు అంటూ కెసిఆర్ సైతం కౌశిక్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

గవర్నర్ నుండి మొదలుపెడితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కెమెరామెన్ పై కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై బిఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ వివాదాలపై స్పందించారు కౌశిక్ రెడ్డి. కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్నపై సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి.

తీన్మార్ మల్లన్న మొగోడు అయితే తాను ముదిరాజ్ సోదరులను తిట్టిన వీడియోలను బయటపెట్టాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈటెల రాజేందర్ 3 యూట్యూబ్ చానల్స్ లో అసత్య ప్రచారాలు చేయిస్తున్నాడని ఆరోపించారు. ఈటల రాజేందర్ కి దమ్ముంటే ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాలని.. ముదిరాజ్ లపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version