దేశంలోనే సిల్లీ సీఎంగా కేసీఆర్ మిగిలిపోయారు – ఎంపీ అరవింద్

-

సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో మరోసారి విమర్శలు గుప్పించారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం కేసీఆర్ దేశంలోనే సిల్లీ సీఎంగా మిగిలిపోయారని అన్నారు. సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితి కెసిఆర్ కి వచ్చిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ అలా భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలేనని అన్నారు. కవిత, కేటీఆర్ లను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.

అసలు కవితను ఏ పార్టీ వారైనా కొంటారా అంటూ ఎద్దేవా చేశారు. కవితను కొనేందుకు బిజెపిలో ఎవరైనా ప్రయత్నిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని.. బండి సంజయ్, జేపీ నడ్డాలను డిమాండ్ చేశారు. పవర్ సెక్టార్ ను గాలికి వదిలేసి పాలకులు గంజా, డ్రగ్స్ పార్టీలో బిజీగా ఉన్నారన్నారు. బిడ్డ బ్యూటీ పార్లర్ మీద సంపాదించిన డబ్బుతో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు కేసిఆర్ ఫీలవుతున్నారని వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు లిక్కర్స్ గా పార్టనర్స్ అని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news