కెసిఆర్.. నీ పతనం ఖాయం – వైఎస్ షర్మిల

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కారుతో హల్చల్ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి సోమాజిగూడ చేరుకున్న వైయస్ షర్మిల.. సోమాజిగూడ నుండి ప్రగతి భవన్ కి వెళ్లేందుకు ప్రయత్నించింది. నిన్న దాడిలో అద్దాలు పగిలిన కారుని స్వయంగా నడుపుకుంటూ వచ్చిన షర్మిల వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు.

దీంతో రోడ్డుపైనే వాహనాన్ని నిలిపిన షర్మిల కారు నుంచి బయటకి రాలేదు. పోలీసులు బయటకు రావాలని కోరినప్పటికీ తాను ప్రగతి భవన్ కి వెళతానని షర్మిల పట్టుబట్టింది. కార్ డోర్లు లాక్ చేసుకుని లోపల ఉండిపోయింది షర్మిల. దీంతో చేసేదేమీ లేక షర్మిల కారు లోపల ఉండగానే క్రేన్ సహాయంతో వాహనాన్ని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ కారు డోర్స్ బ్రేక్ చేసి షర్మిలను పోలీస్ స్టేషన్ లోకి తరలించారు.

ఇక తాజాగా షర్మిల ఈ విషయం పై ట్వీట్ చేస్తూ.. కెసిఆర్ పిరికిపంద చర్యలకు బెదిరేది కాదు వైఎస్సార్ బిడ్డ అంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, టిఆర్ఎస్ గుండాలను ఉసిగొల్పి దాడులకు పాల్పడితే.. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. కెసిఆర్ ప్రగతి భవన్ లో దాక్కున్న, ఫామ్ హౌస్ లో దాక్కున్నా.. ఆయన పతనం ఖాయం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news