బిజెపిపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

-

బిజెపి పై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బిజెపి లీడర్ల మాటలు ఢిల్లీ కోటలు దాటుతాయి కానీ.. చేతలు మాత్రం గోల్కొండ కోటకే పరిమితమని ఎద్దేవా చేశారు. కెసిఆర్ అవినీతిని బిజెపి ఎందుకు బయటపెట్టడం లేదని లేదని సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

“‘కేసీఆర్ అవినీతి శక్తి’- మోడీ, ‘కేసీఆర్ అవినీతిపరుడు’- అమిత్ షా, ‘కేసీఆర్ కు తెలంగాణ ఏటీఎం’- BL సంతోష్, ‘కేసీఆర్ అవినీతిని బయటపెడుతాం’ – కిషన్ రెడ్డి, ‘కేసీఆర్ ను జైలుకు పంపుతం’- బండి సంజయ్. BJP లీడర్ల మాటలు ఢిల్లీ కోటలు దాటుతయ్. కానీ చేతలు మాత్రం గోల్కొండ కోటకే పరిమితం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కమలం నేతల మాటలు ‘పాడిందే పాటరా.. పాచిపళ్ళ బీజేపీ’ అన్నట్లుంది. కేసీఆర్ అవినీతి కళ్ల ముందు కనిపిస్తున్నా.. మాటలు చెప్పే బీజేపీ చర్యలు మాత్రం తీసుకోదు..

నువ్వు కొట్టినట్లు చెయ్… నేను ఏడ్చినట్లు చేస్తా… ఇదీ BJP-BRS యవ్వారం. కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి కనిపిస్తున్నా.. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తెచ్చి కమీషన్లు దోచుకున్నా.. KCR అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము BJPకి లేదు.. MLAల కొనుగోలుపై CBI విచారణ అడిగిన BJP..
KCR అవినీతిపై ఎందుకు CBI దర్యాప్తు కోరదు? KCR అవినీతి వాటాలో మీ లీడర్ల హస్తం ఉందనా?” అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news