ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డిలకు కీలక పదవులు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసంతృప్తులపై భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే పెండింగ్లో ఉన్న టికెట్లను ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే… తాటికొండ రాజయ్య మరియు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లకు కీలక పదవులు కట్టబెట్టారు సీఎం కేసీఆర్.

Key posts for MLAs Rajaiah and Muthireddy

మొన్నటి వరకు ప్రచారం జరిగినట్లుగానే తెలంగాణ ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నియామకం చేశారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రైతుబంధు చైర్మన్ గా వల్ల రాజేశ్వర్ రెడ్డి పదవిని తాటికొండ రాజయ్యకు ఇచ్చారు. అటు ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ గా నందికంటి శ్రీధర్ ను నియామకం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో గెలవాలని నేపథ్యంలోనే శ్రీధర్ కు ఈ పదవిని ఇచ్చారు. ఆటో మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఉప్పల వెంకటేశులను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version