దసరా నాటికి సొంత జాగాలో ఇళ్ళు కట్టుకునేవారికి నిధులు మంజూరు

-

దసరా నాటికి సొంత స్థలంలో ఇళ్ళు కట్టుకునేవారికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. అలాగే త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. గ్రూప్ 4 నోటిఫికేషన్ తో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. పేదలను మా ప్రభుత్వం కాపాడుకుంటుంది.. దేశంలో ఎక్కడ కూడా 2016 రూపాయల పెన్షన్లు ఇస్తలేరని తెలిపారు. ఢిల్లీలో బిజెపి ఉచితాలు బంద్ చేయమంటుంది.. ఏది ఉచితం ఏది అనుచితం అని ప్రశ్నించారు.

మీరు బడా బడా నేతల కు రుణ మాఫీ చేశారని.. 400 ఉన్న సిలిండర్ 1200 చేశారని అగ్రహించారు. ఏడాది కి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రం చెప్పింది.. అంటే 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇచ్చుడేమో కానీ ఉన్న ఉద్యోగాలు ఉడిపోయాయి.. ఇంటి అడుగు జాగా ఉంటే 3 లక్షల రూపాయలు దసరా లోపు సహాయం చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. ఆనాడు 20 లక్షల మంది కి పెన్షన్లు ఇస్తుండే…ఇప్పుడు తెలంగాణ లో 45 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news