గుజరాతీల చెప్పులు మోయడమే నీ పని – బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. గుజరాత్ వాళ్ల చెప్పులు మోయడమే బండి సంజయ్ పని అని వ్యాఖ్యానించారు. కరీంనగర్ కి ఏం చేశావో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. సిరిసిల్లలో జరిగిన సెస్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..

రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ. 3.68 లక్షల కోట్లు వెళ్లాయని.. కేంద్రం నుండి తెలంగాణకు రూ. రెండు లక్షల కోట్లు వచ్చాయని అన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. సెస్ ఎన్నికల సమయంలో బండి సంజయ్ ఐదు కోట్లు తీసుకువచ్చాడని ఆరోపించారు. సెస్ లో గెలవలేనోడు రాష్ట్రంలో గెలుస్తారా? అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news