జేపీ నడ్డా పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

-

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పై తెలంగాణ మంత్రి కేటిఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.” కర్ణాటకలో సీఎం కావాలంటే రూ 2,500 కోట్లు అడుగుతున్నారట.” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని ఆయన అన్నారు. తాము ప్రభుత్వానికి 40 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉందని గుత్తేదారులు, తాము 30 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉందని హిందూ మఠం వారు అంటున్నారని తెలిపారు. ఈ అంశాలపై ఎలా స్పందిస్తారని జేపీ నడ్డాను నిలదీశారు కేటీఆర్.

వస్తున్న విమర్శలను అణచివేసేందుకే ఈడి, ఐటి, సిబిఐ,? లను పంపిస్తారా. అంటూ చురకలంటించారు. ఈ సందర్భంగా కర్ణాటక లో సీఎం కావాలంటే రూ. 2500 కోట్లు అడుగుతున్నారు అంటూ బీజేపీ నేత అన్నారని వచ్చిన ఓ కథనాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే దేశంలో గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 50 రూపాయలు పెంచారు అంటూ వచ్చిన మరో వార్త కూడా కేటీఆర్ పోస్ట్ చేశారు. మరోసారి ధరలు బాదారంటూ విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news