ముచ్చటగా మూడోసారి కూడా టీఆర్‌ఎస్‌ దే అధికారం – KTR

-

ముచ్చటగా మూడోసారి కూడా టీఆర్‌ఎస్‌ దే అధికారమని మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. ఇవాళ ASK కేటీఆర్‌ లో కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానాలు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ పార్టీలతో సహా చాలా పార్టీలు మాకు పోటీలో ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ప్రధాని మోడీ అనడం సరికాదని మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. బీజేపీ పార్టీ అప్పుడు గ్యాస్‌ ధరలపై పోరాడి.. ఇప్పుడు ధరలు తగ్గించాలనడం మోసం అని ఫైర్‌ అయ్యారు.

మూడోసారి అధికారంలోకి వచ్చి.. అభివృద్ధిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని బీజేపీ పార్టీ అమ్ముకుంటోందని చురకలు అంటించారు. బీజేపీ పార్టీ అసలు స్వరూపం ఇదేనని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. త్వరలోనే స్పోర్ట్స్‌ పాలసీని తీసుకువస్తామని… కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఎలాంటి సహాయం చేయలేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news